News March 5, 2025
నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.
Similar News
News February 26, 2026
HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం
News February 26, 2026
హైదరాబాద్-విశాఖ ప్రయాణం ఇక ఈజీ

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే(NH-365BG) పనులు దాదాపు పూర్తయ్యాయి. TGలోని ఖమ్మం నుంచి APలోని దేవరపల్లి(తూ.గో.) వరకు 162KMల రహదారిని రూ.4,451 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-వైజాగ్ ప్రయాణ సమయం 12 గంటలు ఉండగా ఇది అందుబాటులోకి వస్తే టైమ్ భారీగా తగ్గనుంది. ఈ హైవేను ప్రధాని మోదీ మేలో ప్రారంభించనున్నారు.
News February 26, 2026
NH-365BG ప్రత్యేకతలివే..

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తోన్న 4 లేన్ల NH-365BGకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హైవేపై అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ప్రతి 2KMలకు ఒకటి చొప్పున 95 CCTVలు ఉంటాయి. ఈ రూట్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. రహదారి మొత్తం సోలార్ లైట్లు ఉంటాయి. 5KMకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాలి.


