News March 19, 2025
నిర్మల్: టిప్పర్ కిందపడి ఒకరి దుర్మరణం

జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాలనీకి చెందిన జవాన్ కరణ్ సింగ్(22) యువకుడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులతో కలిసి చించోలి వెళ్లి తిరిగి వస్తుండగా ఆలయం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్ టేక్ చేసి కిందపడ్డారు. దీంతో కరణ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 27, 2025
వరంగల్: నేడే మంచి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూడాళ్లు ప్రారంభం అవుతున్నాయి. దీంతో, భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News November 27, 2025
విజయనగరం: ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్ ఎక్కించే సమయంలో గందరగోళానికి గురయ్యారు. ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మరొకరికి ఎక్కించారు. O పాజిటివ్ మహిళకు B పాజిటివ్, B పాజిటివ్ మహిళకు O పాజిటివ్ ఎక్కించారు. వెంటనే తప్పును గుర్తించి వారికి చికిత్స అందించారు. దీనిపై సూపరింటెండెంట్ డా.పద్మజ విచారణ చేపట్టారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


