News April 1, 2025

నిర్మల్: తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం: కలెక్టర్

image

తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం అందించే పోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువలున్న పోషకాలు, విటమిన్లు ఉంటాయన్నారు. ఇందులో తహాశీల్దార్ రాజు, ఆర్ఐ వెంకటరమణ ఉన్నారు.

Similar News

News December 10, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 5 సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.30,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 10, 2025

మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

image

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్‌కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT

News December 10, 2025

కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య(55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.