News March 12, 2025

నిర్మల్: ‘దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి’

image

ప్రభుత్వం నూతన పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశామన్నారు.

Similar News

News October 29, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పొంగులేటి

image

భారీ వర్షాల నేపథ్యలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీంతో బుధవారం ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

News October 29, 2025

ఏలూరు: ఆడ శిశువు అమ్మేసిన తల్లిదండ్రులు

image

నవ జాత శిశువు విక్రయం కేసులో నల్గొండ పోలీసులు పురోగతి సాధించారు. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు. శిశువు సహా ఆ దంపతులను నల్గొండకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార దంపతుల సంతానమైన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే.

News October 29, 2025

జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

image

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.