News January 25, 2025
నిర్మల్: నేటి నుంచి రోజూ 2 గంటల కరెంట్ కట్

జిల్లాలో ఈనెల 25 నుంచి రోజూ 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందని నిర్మల్ విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సుదర్శనం శుక్రవారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు కరెంట్ ఉండదన్నారు. వ్యవసాయ పొలాలకు నిరంతరాయం విద్యుత్ అందించే ఉద్దేశంతో రూ.5కోట్ల వ్యయంతో 160 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News November 14, 2025
వరల్డ్ క్లాస్ లెవెల్లో.. రూ.600 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.!

విజయవాడ రైల్వే స్టేషన్ను PPP మోడల్ కింద రూ.600 కోట్లకు పైగా నిధులతో వరల్డ్ క్లాస్ వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవగా, DEC 15తో గడువు ముగియనుంది. 24/7 వైఫై, AC హాల్స్, ప్రతి ప్లాట్ఫామ్పై ఎస్కలేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు వంటి అనేక హంగులతో స్టేషన్ను తీర్చిదిద్దనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మోడల్ కింద ఎంపికైన ఏకైక స్టేషన్ విజయవాడ అని అధికారులు తెలిపారు.
News November 14, 2025
జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న సిద్దిపేట ప్రజలు

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.
News November 14, 2025
రెండో రౌండ్లోనూ సేమ్ సీన్

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో నవీన్కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


