News January 25, 2025
నిర్మల్: నేటి నుంచి రోజూ 2 గంటల కరెంట్ కట్

జిల్లాలో ఈనెల 25 నుంచి రోజూ 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందని నిర్మల్ విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సుదర్శనం శుక్రవారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు కరెంట్ ఉండదన్నారు. వ్యవసాయ పొలాలకు నిరంతరాయం విద్యుత్ అందించే ఉద్దేశంతో రూ.5కోట్ల వ్యయంతో 160 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News November 19, 2025
జగిత్యాల: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం, బ్యాంకుల్లో ప్రత్యేక సౌకర్యాలు, చట్టాలపై అవగాహన అవసరమని కలెక్టర్ చెప్పారు. వృద్ధులు తమ సమస్యలు, సూచనలు సమావేశంలో వెల్లడించారు.
News November 19, 2025
రుణాల పంపిణీ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. రుణాలు పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పంట, హార్టికల్చర్, ముద్ర, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్, పీఎంఈజీపీ, స్వయం సహాయక బృందాల లింకేజ్, పీఎం స్వనిధి వంటి రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్టోర్షన్కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.


