News January 25, 2025
నిర్మల్: నేటి నుంచి రోజూ 2 గంటల కరెంట్ కట్

జిల్లాలో ఈనెల 25 నుంచి రోజూ 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందని నిర్మల్ విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సుదర్శనం శుక్రవారం తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు కరెంట్ ఉండదన్నారు. వ్యవసాయ పొలాలకు నిరంతరాయం విద్యుత్ అందించే ఉద్దేశంతో రూ.5కోట్ల వ్యయంతో 160 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News October 18, 2025
TTD ఉద్యోగులకు దీపావళి కానుక

తిరుమల తిరుపతి దేవస్థానాల సిబ్బంది సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో దీపావళి కానుకగా టీటీడీ ఉద్యోగులకు నాణ్యమైన బ్యాగుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. బ్యాంక్ అధ్యక్షుడు తలారి మహేష్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పండుగల సందర్భాల్లో ఉద్యోగులకు ఉపయోగకరమైన బహుమతులు అందించడం తమ సంప్రదాయమని తెలిపారు.
News October 18, 2025
KNR: శాతవాహనలో MBA స్పాట్ అడ్మిషన్స్

MBA కోర్సులో 2025-2026 విద్యా సం.కి ప్రవేశాల కోసం అర్హత పొందిన, అర్హత లేని అభ్యర్థులకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్ మెంట్, శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. బి.హరి కాంత్ తెలిపారు. 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో ఉన్నట్లు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు, అవసరమైన ఫీజుతో హాజరుకావాలన్నారు.
News October 18, 2025
CPS అంశాన్ని త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

AP: *ఈ దీపావళి లోపు RTC ఉద్యోగుల ప్రమోషన్లు క్లియర్ చేస్తాం
*180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు
*పోలీసులకు EL’s కింద NOVలో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం
*నాలుగో తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీ డెసిగ్నేట్
*CPS అంశంపై చర్చించి త్వరలో పరిష్కరిస్తాం
*ఉద్యోగ సంఘాల భవనాల ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం