News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డు సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
Similar News
News December 13, 2025
హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్: తిరుపతి SP

తిరుపతి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మూడు దశల ప్రణాళికను అమల్లోకి తెచ్చామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందన్నారు. జరిమానాలు కాదని.. ప్రాణ రక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని అందరూ హెల్మెంట్ వాడాలని కోరారు. తిరుపతి జిల్లాలో ఈనెల 15 నుంచి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.
News December 13, 2025
సంగారెడ్డి: రెండో విడతలో మహిళా ఓటర్లే కీలకం

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,47,746, మంది మహిళలు 2,51,757 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రసన్నం చేసుకుంటున్నారు. వేరే ఎవరికి ఓటు వేస్తారో 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
News December 13, 2025
NZB: 2వ విడత.. 38 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం

ఆదివారం జరగబోయే 2వ విడత GPఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 568 మంది బరిలో నిలిచారన్నారు.


