News February 26, 2025
నిర్మల్: పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారని డీఈవో రామారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News October 13, 2025
మేమూ వారి పద్ధతిలోనే USను గౌరవిస్తాం: చైనా

తమ ఉత్పత్తులపై US 100% అదనపు సుంకం విధించడంపై చైనా స్పందించింది. ‘పరస్పర ప్రయోజనాలకోసం అదేరకమైన టారిఫ్ వారిపైనా వేసి సమాన గౌరవం ఇస్తాం’ అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా తీరు ఇలాగే ఉంటే తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోక తప్పదని పేర్కొంది. US తప్పుడు విధానాలను మార్చుకోవాలని విదేశాంగ అధికార ప్రతినిధి సూచించారు. కాగా తాజా టారిఫ్తో చైనా వస్తువులపై US టారిఫ్ భారం 130%కి చేరుతుంది.
News October 13, 2025
పీజీఆర్ఎస్కు 24 అర్జీలు: ఎస్పీ రాహుల్ మీనా

పీజీఆర్ఎస్కు ప్రాధాన్యత ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 24 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
News October 13, 2025
జొన్న సాగు.. మేలైన యాజమాన్య పద్ధతులు

తెలుగు రాష్ట్రాల్లో రబీలో జొన్నను OCT రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 3KGల మోతాదు, మొక్కల మధ్య 15CM, వరుసల మధ్య 45CM దూరం ఉండేలా విత్తుకోవాలి. KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 WS+ 2గ్రా కార్బెండజిమ్తో శుద్ధి చేయాలి. విత్తిన తర్వాత 35 రోజులపాటు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అంతర పంటలుగా కంది 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అపరాలను కూడా విత్తుకోవచ్చు.