News March 24, 2025
నిర్మల్: పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9,100 మంది విద్యార్థులకు గాను 9,089 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.
News November 16, 2025
పల్నాడు యుద్ధ వీరుల ఆయుధాల గురించి మీకు తెలుసా.?

11వ శతాబ్దంలో పల్నాడు యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలు నేటికీ సజీవంగా పూజలు అందుకుంటున్నాయి. మహామంత్రి బ్రహ్మనాయుడు ఉపయోగించిన నృసింహకృతం, బాలచంద్రుడు వాడిన సూర్య బేతాళం, సర్వ సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు భైరవ ఖడ్గం నేటికీ కారంపూడి వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజింపబడుతున్నాయి. ఉత్సవాలకు వీటిని బయటకు తెచ్చి యుద్ధ రీతులలో ప్రదర్శించి ముగింపు అనంతరం తిరిగి భద్రపరుస్తారు.
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/


