News March 19, 2025
నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 25, 2025
GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.
News November 25, 2025
వరంగల్: అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే..?

WGL(D) సంగెం(M) ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒక్క SCగా 60ఏళ్ల కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే జాక్పాట్. మొత్తం 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో ఇప్పుడు మల్లమ్మ ప్రజెంట్ ఫేవరెట్గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా ఆమెను సంప్రదిస్తున్నాయట. ప్రేమవివాహం చేసుకున్న BC-SC దంపతులపైనా పార్టీల దృష్టి పడినట్లు సమాచారం.
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


