News March 15, 2025

నిర్మల్‌: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

image

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

డీఎస్సీ అభ్యర్థులకు 134 బస్సులు: డీఈవో

image

రేపు అమరావతిలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని డీఈవో శామ్యూల్ తెలిపారు. వారిని అమరావతికి తీసుకెళ్లేందుకు 134 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,590 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించారని అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, అభ్యర్థులు ఉ.7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలని తెలిపారు.