News February 26, 2026
నిర్మల్: పుష్కరాలకు కావల్సిన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News April 13, 2026
పార్వతీపురం జిల్లాలో 42 మందిపై కేసులు నమోదు: ఎస్సీ

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.
News April 13, 2026
ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.
News April 13, 2026
VZM: గొర్రెల కాపరిని తాళ్లతో కట్టిపడేసిన దుండగులు

బొండపల్లి మండలం గొల్లలపేటకు చెందిన పీతల సత్యం(60) ఆదివారం గ్రామానికి సమీపంలోని చింతల చెరువు వద్ద గొర్రెలు కాస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తాటినారతో కాళ్లు,చేతులు,మెడను కట్టి పొదల్లో పడేసినట్లు బాధితుడు వాపోయాడు. అటువైపుగా వెళ్తున్న వ్యక్తులు సాయంత్రం తుప్పల్లో పడి ఉన్న సత్యంను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గజపతినగరం ఆసుపత్రికి తరలించారు.


