News April 23, 2025

నిర్మల్: పేదింటి అమ్మాయిలకు స్టేట్ ర్యాంకులు

image

పేద కుటుంబాల నుంచి వచ్చి గురుకులాల్లో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు నిర్మల్ అమ్మాయిలు. శాంతినగర్ గురుకుల బాలికల కళాశాలల ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో అక్షయ 435, విజయలక్ష్మి, కీర్తన 433, వైష్ణవి 432 మార్కులు సాధించారు. ఎంపీసీలో శార్వాణి, శ్రీవల్లి 465, సంధ్యారాణి, వర్షిని 464, కీర్తన 463 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని కొనియాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

Similar News

News April 23, 2025

KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

image

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.

News April 23, 2025

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

image

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

News April 23, 2025

రాజమండ్రిలో 25న మెగా జాబ్ మేళా

image

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి తెలిపారు. APSSDC & ప్రభుత్వం కళశాల (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 30కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని,యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు.

error: Content is protected !!