News March 19, 2025
నిర్మల్: పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి : ఫైజాన్ అహ్మద్

విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గ్రూప్స్ ,సివిల్స్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే సులభంగా ర్యాంకులను సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.
News October 31, 2025
బాసర: ఆర్జీయూకేటీ కాలేజీలో ఇంగ్లిష్ భాషపై ప్రత్యేక శిక్షణ

బాసర ఆర్జీయూకేటీలో ఇంగ్లిష్ విద్యా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు 2 రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్జీయూకేటీ ఎంపికైన ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యాలను పెంపొందించడం కోసం శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన విద్యార్థులు ఆంగ్ల భాష అంటే భయపడకూడదని, ప్రతిరోజు కొద్దిగా సాధన చేయాలన్నారు.
News October 31, 2025
జగిత్యాల: ‘రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి’

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని మోరపెల్లి గ్రామంలో గల ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరిణి, జగిత్యాల రూరల్ తహశీల్దార్ వరందన్, గిర్దావర్ భూమయ్య, జీపీవో మహేశ్ పాల్గొన్నారు.


