News March 19, 2025

నిర్మల్‌: పోటీ పరీక్షలపై దృష్టి సారించాలి : ఫైజాన్ అహ్మద్

image

విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గ్రూప్స్ ,సివిల్స్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే సులభంగా ర్యాంకులను సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News November 21, 2025

భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా అరెస్టు

image

భద్రాచలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్ఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయగా, 65 కిలోల కల్తీ నెయ్యి డబ్బాలు లభించాయి. దీని విలువ రూ.52 వేలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News November 21, 2025

విగ్రహాలను పూజించడం వెనుక సైన్స్

image

హిందూ మతంలో విగ్రహారాధనను ఎక్కువ ప్రోత్సహిస్తాం. అనేక దేవుళ్లు శిలలా మారడంతో విగ్రహాలే దైవాలని మనం వాటికి పూజలు చేస్తుంటాం. దేవుడు అందులో నుంచే మన మొరను వింటాడని అనుకుంటాం. అయితే ఈ విగ్రహారాధన ఆధ్యాత్మికంగా మనకు ఓ స్పెషల్ ఫోకస్‌ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రార్థన సమయంలో విగ్రహాన్ని చూస్తే.. మన ఆలోచనలు ఆయన రూపంతో అనుసంధానమైన మనల్ని భక్తి పథంలో నడిపిస్తాయని ఓ పరిశోధనలో తేల్చారు.

News November 21, 2025

AIIMS గువాహటిలో 177 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిమ్స్ గువాహటి 177 Sr. రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ (MD/MS/DNB), MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWSలకు రూ.500. వెబ్‌సైట్: https://aiimsguwahati.ac.in.