News February 5, 2025

నిర్మల్: పోలీస్ క్రీడాకారులను అభినందించిన ఎస్పీ

image

రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్‌లో పతకాలు సాధించిన నిర్మల్ పోలీస్ క్రీడాకారులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. మహిళ కానిస్టేబుల్ కళ్యాణి బంగారు పతకం, కానిస్టేబుల్ ముత్యం కాంస్య పతకం సాధించారు. దీంతో వారిని ఆమె కార్యాలయంలో అభినందించారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

image

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

NGKL: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 18, 2025

యాదాద్రి: అమ్మకు భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

image

యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో “అమ్మకు భరోసా” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఒకేరోజు 300 మంది గర్భిణుల ఇండ్లకు ఏకకాలంలో 300 మంది అధికారుల బృందాలు వెళ్లాయి. ఇందులో భాగంగా గుండాల మండలంలోని అనంతారానికి చెందిన అపర్ణ అనే గర్భిణి ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, న్యూట్రిషన్ కిట్ అందించారు. 

error: Content is protected !!