News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్కు బయల్దేరుతుందని వెల్లడించారు.
Similar News
News November 17, 2025
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించి 6, కుటుంబ తగాదాలకు సంబంధించి 1, గొడవలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 6 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.
News November 17, 2025
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించి 6, కుటుంబ తగాదాలకు సంబంధించి 1, గొడవలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 6 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.
News November 17, 2025
కిల్లింగ్ క్యాన్సర్: SU212తో ప్రాణాంతక కణాలకు ‘ఆహారం’ కట్!

అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) చికిత్సలో కీలక ముందడుగు పడింది. పరిశోధకులు SU212 అనే అణువును కృత్రిమంగా రూపొందించారు. ఇది క్యాన్సర్ కణాలు జీవించడానికి అవసరమైన ENO1 అనే ఎంజైమ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. స్వయంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా ఇది కణాలకు శక్తి సరఫరాను ఆపివేసి, కణితి పెరుగుదలను & వ్యాప్తిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


