News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

ఖానాపూర్ నుంచి మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్కు బస్సు బయల్దేరుతుందని వెల్లడించారు.
Similar News
News January 8, 2026
SV ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్

తిరుపతిలోని TTD ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్ను కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ సెంటర్ దోహదపడుతుంది. విద్యార్థుల ఆలోచనకు జీవం పోసి నూతన ఆవిష్కరణలను వెలికితీయవచ్చు. దీనిపై కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.
News January 8, 2026
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

TG: ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.
News January 8, 2026
నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.


