News March 17, 2025

నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

image

ఖానాపూర్ నుంచి మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బస్సు బయల్దేరుతుందని వెల్లడించారు.

Similar News

News October 28, 2025

ఈ మందు ‘యమ’ డేంజర్

image

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.

News October 28, 2025

ఆలేరులో అధిక వడ్డీ, బిట్ కాయిన్ల దందా

image

ఆలేరులో అధిక వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొందరు వడ్డీ వ్యాపారులు బాధితుల నుంచి ముందుగానే తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అలాగే బిట్ కాయిన్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ బినాన్స్ వ్యవహారంపై గతంలో వార్తలొచ్చాయి. అధిక డబ్బుకు ఆశపడి జీవితాలు ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News October 28, 2025

అనకాపల్లి: అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్న తుఫాన్

image

మొంథా తుఫాన్ అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. మంగళవారం నుంచి ఈదురు గాలులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రైతులు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 54,000 హెక్టార్లకు పైగా వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది.గాలులు వీస్తే పంట నేల మీదకు వాలిపోతుందని రైతులు తెలిపారు.