News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

ఖానాపూర్ నుంచి మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్కు బస్సు బయల్దేరుతుందని వెల్లడించారు.
Similar News
News December 6, 2025
కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శిపై DLPO విచారణ

ముదినేపల్లి మండలం కొర్రగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి జె.గిరిజ 15వ ఆర్ధిక సంఘం నిధులు దుర్వినియోగం చేసినట్లు గ్రామస్తులు చంద్రకాంత్.. కలెక్టర్కు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం విచారణ చేపట్టారు. DLPO అమ్మాజీ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యదర్శి గిరిజ తనకు అనుకూలమైన వారిని వెండర్లుగా సృష్టించి ఆర్ధిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు చంద్రకాంత్ DLPOకు తెలిపారు.
News December 6, 2025
టర్కీ కోళ్ల రకాలు – ప్రత్యేకతలు

☛ బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్: ఈ టర్కీ కోళ్ల ఈకలు నల్లగా ఉండి తోక చివరి భాగంలో మాత్రం తెల్ల రంగులో ఉంటాయి.
☛ బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్: ఈ తెలుపు రంగు టర్కీలు భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోగలవు. డ్రెస్సింగ్ తర్వాత శుభ్రంగా కనిపిస్తాయి.
☛ బెల్టస్విల్లే స్మాల్ వైట్: ఈ రకం టర్కీ కోళ్లకు గుడ్ల ఉత్పత్తి, గుడ్డు పొదిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
News December 6, 2025
పుతిన్కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.


