News March 5, 2025
నిర్మల్: బడులకు ల్యాప్టాప్లు వచ్చాయ్…!

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్టాప్లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News October 20, 2025
కేయూ: ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్స్

కేయూ పరిధిలోని స్కూల్ ఆఫ్ లర్నింగ్ (కేయూఎస్ఎల్)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు SDLCE డైరెక్టర్, కేయూఎస్ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.సురేష్ తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్ల కోసం అక్టోబరు 21వ తేదీన SDLCEలో సంప్రదించాలని కోరారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీటు రాని అభ్యర్థులు అడ్మిషన్లు పొందవచ్చునని చెప్పారు.
News October 20, 2025
రాజంపేట: రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్కు అక్కాతమ్ముడు ఎంపిక

రాజంపేటలోని ఓ పాఠశాలలో చదువుతున్న అక్కా, తమ్ముడు రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కడప మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 1వ తరగతి చదువుతున్న సగిలి రావణ రింగ్ రేస్-1, 2లో రెండు గోల్డ్ మెడల్ సాధించాడు. అక్క సంఘమిత్ర రింగ్ రేస్-1లో రజత పతకం సాధించింది. కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారని టీచర్లు తెలిపారు.
News October 20, 2025
ఉరవకొండలో ఆ రోజు.. దేవుడు మాట్లాడారు!

పుట్టపర్తి సత్యసాయి బాబా 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో తన అవతారాన్ని ప్రకటించారు. అబ్కారీ బంగ్లా సమీపంలోని రాతి గుండుపై కూర్చొని ‘నేను సత్యనారాయణుడు కాదు, సత్యసాయిని’ అని ప్రకటించారు. ఆ ప్రదేశంలో డా.నలబాల ఆంజనేయులు 2003లో భజన మందిరం నిర్మించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న అక్కడ రథోత్సవం జరుగుతుంది. అవతార ప్రకటన తర్వాత సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనసాగించారు.