News March 22, 2025
నిర్మల్: బీఆర్ఎస్ నేతల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని పలు మండలాల బీఆర్ఎస్ నేతలను శనివారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా మాఫీ చేయలేదన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ రిజర్వేషన్లపై ఫిర్యాదు

పాలకీడు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్క పంచాయతీకి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదంటూ నక్క శ్రీనివాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బీసీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లోనూ జనరల్ రిజర్వేషన్లు కేటాయించకపోవడం అన్యాయమని ఆరోపించారు. జీఓ 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదని ఆయన పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
రేపు హైదరాబాద్లో వాటర్ బంద్

నగరానికి తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, 3లో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉ.10 గం. నుంచి సా.4 గం. వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. చార్మినార్, వినయ్నగర్, భోజగుట్ట, రెడ్హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, హయత్నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.


