News April 15, 2025

నిర్మల్: భూభారతిని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్దాం: కలెక్టర్

image

భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్ధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించి ప్రజలు లేవనెత్తి సమస్యలపై సందేహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి రైతుకు భూభారతి పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News July 11, 2025

సత్తెనపల్లి: విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ

image

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి శుక్రవారం సత్తెనపల్లి పీఎస్‌కు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన నెపంతో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సత్తెనపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. నేడు ఉదయం 11 గంటలకి సత్తెనపల్లి అర్బన్ పీఎస్‌లో విచారణకు రావాలని అంబటికి నోటీసులు జారీ చేశారు.

News July 11, 2025

బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

image

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?

News July 11, 2025

JMKT: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు ఏసీ బోగీ

image

సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్(12733 – 34) రైలుకు ఒక అదనపు ఏసీ బోగీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 13 నుంచి ఈ అదనపు బోగీ అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు ఏసీ బోగీ ఏర్పాటుతో సెలవుల్లో వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్‌తో పాటు, సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.