News April 5, 2025
నిర్మల్ : ‘భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి’

అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఎకరా భూమి విలువైనదని, అటవీ, రెవెన్యూ భూముల హద్దులను తక్షణమే గుర్తించాలన్నారు. ఇందుకోసం రెగ్యులర్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 17, 2025
KNR: ప్రజావాణికి 288 దరఖాస్తులు

సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి 288 అర్జీలను స్వీకరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆమె ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కోసం అర్జీలను సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
News November 17, 2025
హనుమకొండ: రేపు, ఎల్లుండి జిల్లాలో సీపీఐ బస్సు జాతా

సీపీఐ 100 సంవత్సరాల ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు జాతా కార్యక్రమం 18, 19వ తేదీల్లో హనుమకొండ జిల్లాలో పర్యటిస్తుందని, బస్సు జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CPI జిల్లా కార్యదర్శి బిక్షపతి అన్నారు. ముల్కనూరు, ఎల్కతుర్తి, హసన్పర్తి, హనుమకొండ, దామెర, శాయంపేట మీదుగా బస్సు జాత ఉంటుందని, దీనిని జాతను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని బిక్షపతి కోరారు.


