News March 7, 2025

నిర్మల్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. నిర్మల్‌లో గాలినాణ్యత విలువ 78గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News December 21, 2025

ఎల్లారెడ్డిపేటలో దొంగనోట్ల కలకలం

image

ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగనోట్ల చలామణి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను అదునుగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని తరలించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు, ఓటర్లకు వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన నోటును గమనించిన వ్యాపారి అది నకిలీదని గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనా సమాచారం.

News December 21, 2025

KMR: తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ

image

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పుల్గం రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేస్తున్నందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై అందర్నీ కలుపుకొని ముందుకు వెళతానని అన్నారు.

News December 21, 2025

నాగార్జునసాగర్ నీటిమట్టం ఎంతంటే?

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని డ్యామ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 569.50 అడుగులకు (255.31 టీఎంసీలు) చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి స్థిరంగా వస్తున్న నీటితో సాగర్ జలకళను సంతరించుకుంది.