News March 28, 2025

నిర్మల్: మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది: ఎస్పీ

image

మీరు బాగుంటేనే సమాజం భద్రంగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో ఎండనకా వాననక నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది బాగుండాలని తెలిపారు. 30 ఏళ్ల వయసు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 24, 2025

జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

image

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News December 24, 2025

కోరుట్ల: భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు

image

కోరుట్ల పట్టణ శివారులోని పెద్ద గుండు దగ్గర గ్రౌండ్ లో మంగళవారం మద్యం సేవించి తాగిన మత్తులో భార్యాభర్తల పై దురుసుగా ప్రవర్తించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుగా వచ్చిన భర్త పైన దాడి చేసిన సంఘటనలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News December 24, 2025

జగిత్యాల: ‘పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?’

image

జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి యావర్ రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను తీవ్రంగా విమర్శించారు. 2017లోనే 100 ఫీట్ల విస్తరణకు నివేదిక పంపినా, ఎన్నికల లబ్ధి కోసం పనులు అడ్డుకున్నారని ఆరోపించారు. 2021లో జీఓ 94 వచ్చినా అమలు చేయలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి విస్తరణ చేయకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.