News January 29, 2025

నిర్మల్: ‘వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలి’

image

వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ ఎన్టీఆర్ మిని స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Similar News

News November 12, 2025

నల్గొండకు మరో అరుదైన గౌరవం

image

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.

News November 12, 2025

IT కారిడార్లకు త్వరలో స్కైవాక్‌లు, మోనో రైలు!

image

TG: IT కారిడార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మోనో రైలుకు అనుసంధానించేలా స్కైవాక్‌లు నిర్మించాలని యోచిస్తోంది. దీనికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్ తప్పనిసరి. స్కైవాక్‌లను CSR ఫండ్స్ ద్వారా, మోనో రైలును PPP మోడల్‌లో నిర్మిస్తారు. త్వరలోనే CM రేవంత్ నుంచి దీనికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు Way2Newsకు తెలిపారు.

News November 12, 2025

ఆర్మూర్: బ్రిడ్జి పనుల్లో జాప్యం.. దుమ్ము ధూళితో శ్వాసకోశ ఇక్కట్లు

image

ARMR- NZB వెళ్లే మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై కంకర వేసి, నీరు కొట్టకపోవడం వల్ల భారీగా దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. ఈ ధూళి కళ్లు, ముక్కులోకి చేరడం వల్ల వాహనదారులు, అడవి మామిడిపల్లి గ్రామస్థులు తీవ్రశ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుపై తారువేసే పనులను ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.