News February 15, 2025
నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 6, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,051, కనిష్ఠ ధర రూ.1,700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1,901, కనిష్ఠ ధర రూ.1,775, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2,061, కనిష్ఠ ధర రూ.1,910, వరి ధాన్యం (HMT) ధర రూ.1,850, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2,480, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 6, 2025
వర్గల్: ‘మందుల కొరత లేకుండా చూడండి’

వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పెద్ద ఆసుపత్రి కావున ఓపీ పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. పాత ఆసుపత్రి నుంచి పర్నిచర్ షిప్ట్ చేయించాలని, మెడిసిన్ కొరత లేకుండా సప్లై చేయాలని DMHOను ఫోన్లో ఆదేశించారు.


