News February 15, 2025

నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

image

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 25, 2025

రానున్న 4 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 25, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> దేవరుప్పుల పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య > దేవన్నపేట నుంచి సాగునీటిని విడుదల చేయాలి: ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి > కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులు చేసిన కలెక్టర్ > డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి > ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను పరిశీలించిన కలెక్టర్ > పాలకుర్తి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి > మంత్రులు పొన్నం, సీతక్కను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

News March 25, 2025

నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

image

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!