News February 15, 2025

నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

image

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 13, 2025

HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్‌కు వైద్యం!

image

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్‌కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT

News November 13, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా.. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్‌లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం 72,283 మంది స్వామి వారిని దర్శించుకోగా… 22,583 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 13, 2025

మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

image

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?