News March 1, 2025
నిర్మల్: వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

నూతన ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. శుక్రవారం 2024 ఎస్జీటీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ తరగతులను పంచ సీల్ కళాశాలలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ తమ సర్వీసులో విద్యార్థులకు ఏ విధంగా క్రమశిక్షణతో వెలిగి పురోగతి సాధించాలో శిక్షణ అందించారు. ఎంఈఓ నర్సయ్య, విజయ్ కుమార్, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2026
MBNR: భానుడి భగభగలు.. 41.1 డిగ్రీలు నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వేసవి ఎండలు ప్రచండ రూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ (41.0), కౌకుంట్ల (40.9) ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. భూత్పూర్, మిడ్జిల్, మహమ్మదాబాద్ మండలాల్లో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
News April 11, 2026
కేయూ ఎంఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

KU ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం శనివారం విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ విద్యార్థులతో పాటు పాత నియమావళి సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 23, 25, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News April 11, 2026
చర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు!

కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


