News January 30, 2025

నిర్మల్: ‘వేసవిలో బోరు బావులు వేయవద్దు’

image

నిర్మల్ జిల్లాలో అధికంగా బోరుబావులు వాడటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని, వేసవిలో బోరుబావులు వేయవద్దని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 12% అధికంగా ఉన్నందున వ్యవసాయం కోసం ఎక్కువ భూగర్భ జలాలు వాడుతున్నారని తెలిపారు. జిల్లాలో 45 వేలకు పైగా బోరుబావులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

కామారెడ్డిలో పర్యటించిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి

image

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి విక్రమ్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు జిల్లాలో బీజేపీ సంస్థాగత వివరాలను వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై, నాయకత్వం గురించి తెలిపారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, హైమారెడ్డి, BJP నాయకులు పాల్గొన్నారు.

News December 5, 2025

PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

News December 5, 2025

పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

image

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.