News February 16, 2025

నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

image

నిర్మల్‌లో నిర్మించిన చేపల మార్కెట్‌ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.

Similar News

News November 20, 2025

సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

image

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.

News November 20, 2025

జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలి మృతి

image

మల్యాల(M) పోతారం గ్రామానికి చెందిన పున్న లచ్చవ్వ(59) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా మృతురాలు తన సోదరుడి ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఇంటిబయట గడ్డికి నిప్పుపెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకొని గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సోదరుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.

News November 20, 2025

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి: జేసీ

image

రానున్న వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలలో వరి కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో, ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.