News February 16, 2025
నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

నిర్మల్లో నిర్మించిన చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.
Similar News
News December 9, 2025
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు

జిల్లాలో ఈ నెల 11 నుండి 17 వరకు విడతల వారీగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు ఉంటాయని కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10 – 11 వరకు మొదటి విడత, 13 -14 వరకు రెండో విడత, 16-17 వరకు ఎన్నికలు ఉంటాయని, ఆయా గ్రామాల్లోని జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్ల పోలింగ్ కేంద్రాల్లో 2 రోజులు సెలవులు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
News December 9, 2025
సిరిసిల్ల: ‘ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందించాలి’

ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంచార్జి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గర్భిణీల ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News December 9, 2025
చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు


