News February 16, 2025
నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

నిర్మల్లో నిర్మించిన చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.
Similar News
News April 18, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్లలో ఉంటాయి.


