News February 1, 2025

నిర్మల్‌: సదరం శిబిరం క్యాంప్ తేదీలు ఖరారు

image

నిర్మల్ జిల్లాలో సదరం క్యాంప్ వివరాలను అధికారులు వెల్లడించారు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్టులో ఉండి మొబైల్‌కు సమాచారం వచ్చినవారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈ సదరం శిబిరం ఫిబ్రవరి 13 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

తంగళ్ళపల్లి: అధ్యాపకుడిగా మారిన కలెక్టర్

image

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా మాథ్స్, బాటని పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించారు. పాఠ్యాంశాలలోని అనుమానాలను విద్యార్థులకు నివృత్తి చేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

News February 14, 2025

ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

image

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశం

image

బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కేజీహెచ్ ఉన్నతాధికారులకు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 2024లో ఎంతమంది పిల్లలు జన్మించారు.. ఎంతమంది మరణించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన గది వద్దకు తప్పులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.

error: Content is protected !!