News March 21, 2025
నిర్మల్: ‘సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోండి’

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆంగ్ల కవిత్వం ద్వారా జీవన నైపుణ్యాన్ని నేర్పనున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంగ్ల విభాగాధిపతి సుభాష్, అధ్యాపకులు డా.రజిత, రమేశ్ రెడ్డి, సూర్య సాగర్, అర్చన, శ్రీవారి, ఉమెశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
మూడో విడతలో 27,277 నామినేషన్లు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.
News December 6, 2025
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుశిక్ష తప్పదు

వృద్ధ తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే జైలు, జరిమానా తప్పవని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ హెచ్చరించారు. ఆర్డీవో ఛాంబర్లో గుల్లపేట, మల్లన్నపేట్, అల్లీపూర్, పూడూర్ గ్రామాల వృద్ధుల నిరాధారణ కేసులను విచారించారు. వయోవృద్ధుల తరఫున సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వాధించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికాంత్, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<


