News April 2, 2025

నిర్మల్: సాంఘిక పరీక్షకు 12 మంది గైర్హాజరు: డీఈవో

image

ఎలాంటి పొరపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని డీఈవో రామారావు అన్నారు. బుధవారం తానూర్ మండలం బోసి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నేడు జరిగిన సాంఘిక పరీక్షకు జిల్లావ్యాప్తంగా 9117 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 12 మంది పరీక్ష రాయలేదని చెప్పారు.

Similar News

News November 17, 2025

జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ నల్లగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. బైక్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో గొల్లపల్లి మండలం శేకల్లకు చెందిన అరుణ్(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్‌పై ఉన్న మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

News November 17, 2025

అరకు, లంబసింగిలో కారవాన్ పార్కులు

image

ఏపీలో మొదటిసారిగా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లలో కారవాన్ పార్క్‌లు ఏర్పడనున్నాయి. పర్యాటకులకు చిన్న మొబైల్ హౌస్‌లా ఉండే కారవాన్‌ల్లో సురక్షితంగా ఉండే అవకాశం కలుతుందని అధికారులు తెలిపారు. లంబసింగిలో పైలట్‌గా 10-15 ఈ-కారవాన్ వాహనాలు అందించనున్నారు. మొత్తం మూడు పార్కులకు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టబడుతోంది. హోటల్ సౌకర్యాలు తక్కువైన ప్రాంతాల్లో ఇది కొత్త అనుభవం కానుంది.

News November 17, 2025

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు

image

MLAల పార్టీ ఫిరాయింపు ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు MLAలపై 3నెలల గడువులో ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని, 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే కేసును పాస్ ఓవర్ చేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పాస్ ఓవర్ చేసింది. ఈరోజు సాయంత్రం కేసును విచారించే అవకాశం ఉంది.