News March 4, 2025
నిర్మల్: ‘సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు.
Similar News
News March 27, 2025
వనపర్తి: జాగ్రత్తలు పాటించు… వేడిని నియంత్రించు…!

జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు కింది జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.* అత్యవసరమైతేనే బయటకు రండి.* తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలో నీటి లోపాన్ని నివారించండి.* వదులైన, కాటన్ దుస్తులను ధరించడం మంచిది.* చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా చూసుకోండి.
News March 27, 2025
SDPT: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
వికారాబాద్: యువకుడి ఆత్యహత్య

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన బంట్వారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. యాచారం గ్రామానికి చెందిన సుడే మహిపాల్ రెడ్డి(35) ఇంటిదగ్గర వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై తాగిన మైకంలో ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.