News March 29, 2024
నిర్మల్: స్నేహం, ప్రేమ.. సూసైడ్

నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందిన నందిని(20), శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను కాదంటారని భావించి బాసరకు చేరుకున్నారు. రాత్రి 8.30లకు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, వెలుతురు తదితర సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి సూచనలు చేశారు.
News February 12, 2026
ఆదిలాబాద్ పీఠాన్ని హస్త గతం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు

ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఓటింగ్ జరిగిన తీరు గురించి చర్చించారు. అనంతరం క్యాంప్నకు తరలించారు.
News February 12, 2026
ఆదిలాబాద్: రేపు ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా సహకరించాలని, కౌంటింగ్ సందర్భంగా ‘ఐ లవ్ ఆదిలాబాద్ నుంచి మావల పోలీస్ స్టేషన్ వరకు’ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రేపు ఉదయం నుంచి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


