News February 27, 2025

నిర్మల్: 109 మంది ఓటేశారు..!

image

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.

Similar News

News December 24, 2025

BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

image

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్‌ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.

News December 24, 2025

నల్గొండ: ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఇస్తా: సర్పంచ్

image

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేమిల్లగూడెం నూతన సర్పంచ్ ఏరెడ్ల నారాయణరెడ్డి తన సొంత ఖర్చుతో ఊరిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు తన పదవీకాలం ముగిసే వరకు రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పుట్టిందని దిగులు చెందొద్దని, మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నేటి యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు.

News December 24, 2025

సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

image

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. జిల్లాలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.