News February 27, 2025

నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News December 5, 2025

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

image

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.

News December 5, 2025

వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

image

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్‌నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.

News December 5, 2025

సిద్దిపేట: కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు.. ఉచిత చేప పిల్లలు: హరీశ్ రావు

image

కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు ఉచిత చేప పిల్లలు అందాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగా భవాని ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిద్దిపేట ఫిష్ మార్కెట్‌ను చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేశామన్నారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరికి అన్నింటా శుభం చేకూరాలన్నారు.