News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
సిగరెట్ లో గంజాయి.. యువకులే టార్గెట్

వాంకిడి మండలంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఎండు గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని పాన్ షాప్ లో అమ్మి, వారు సిగరెట్లలోని ఎండు గంజాయి నింపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాంకిడిలో ఎండు గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కొందరు యువకులు సిగరెట్, బీడీలలో గంజాయి నింపుకొని ఉదయం,సాయంత్రం ఊరు బయట తాగుతున్నట్టు సమాచారం. గంజాయి తాగడం హానికరం..
News November 18, 2025
సిగరెట్ లో గంజాయి.. యువకులే టార్గెట్

వాంకిడి మండలంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఎండు గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని పాన్ షాప్ లో అమ్మి, వారు సిగరెట్లలోని ఎండు గంజాయి నింపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాంకిడిలో ఎండు గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కొందరు యువకులు సిగరెట్, బీడీలలో గంజాయి నింపుకొని ఉదయం,సాయంత్రం ఊరు బయట తాగుతున్నట్టు సమాచారం. గంజాయి తాగడం హానికరం..
News November 18, 2025
జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.


