News March 7, 2025
నిర్మల్: 415 మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు మాధ్యమిక విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,838 మంది విద్యార్థులకు గాను 6,423 మంది విద్యార్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,869, ఒకేషనల్ విభాగంలో 554 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్పైరీ ఫుడ్ అంటూ!

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.
News December 2, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.
News December 2, 2025
భువనగిరి: ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులు..!

బొమ్మలరామారం(M) చీకటిమామిడికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబీకులు 4 పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. చంద్రమౌళి తొలిసారిగా 1995లో తర్వాత 2001లో కాగా 2007లో ఆయన తల్లి విజయం సాధించారు. 2013లో ఆయన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ MPTCగా గెలుపొందగా 2019లో శ్రీనివాస్ సతీమణి వసంత సర్పంచ్గా గెలిచారు. దాదాపు 30ఏళ్లపాటు తమ కుటుంబం గ్రామానికి సేవలందించిందని, ప్రస్తుతం ఇతరులకు అవకాశం ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.


