News March 5, 2025

నిర్మల్: 434 మంది విద్యార్థులు గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 434 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ జాదవ్ పరశురాం తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 6,944 మంది విద్యార్థులకు గాను 6,510 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News December 17, 2025

TTDలో కొత్త ఉద్యోగాలు..!

image

TTDలో త్వరలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్‌(పాచక) పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని TTD కోరింది. ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్ట్‌లను పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ధాన స‌న్నిధి యాద‌వ‌తో పాటు అద‌నంగా మ‌రో స‌న్నిధి యాద‌వ పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది.

News December 17, 2025

కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

image

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 17, 2025

ఏపీలో 6 జోన్లు.. ఏ జిల్లా ఎక్కడంటే?

image

రాష్ట్రంలో 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా <<18586844>>కేంద్రం<<>> విభజించింది.
*జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, VZG, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి, తూ.గో., కాకినాడ, కోనసీమ.
*జోన్-3: ప.గో., ఏలూరు, కృష్ణా, NTR.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.
*జోన్-6 : కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి.
*మల్టీజోన్-1: జోన్-1, 2, 3
*మల్టీజోన్-2: జోన్-4, 5, 6