News March 3, 2025
నిర్మల్: 8, 9వ తరగతి విద్యార్థులకు పోటీలు

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8, 9 తరగతుల బాలికలకు బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News January 6, 2026
KNR: AIFB పార్టీ వైపు ఆశావహుల చూపు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలలో కాంపిటీషన్ ఉండటంతో ఆశావహులు AIFB పార్టీ టికెట్ పై పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి AIFBలో సభ్యత్వం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. ఉమ్మడి KNRలో AIFB నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం MLAగా కోరుకంటి చందర్ గెలవగా, గత మున్సిపల్ ఎన్నికల్లో RGMలో 11, KNRలో 3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది.
News January 6, 2026
కుంకుమ పువ్వు, కూరగాయలతో ఏటా రూ.24 లక్షల ఆదాయం

అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వును సాగు చేస్తూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఒడిశాకు చెందిన సుజాతా అగర్వాల్. తన ఇంట్లోనే 100 చ.అడుగుల గదిలో మూడేళ్లుగా ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వును, హైడ్రోపోనిక్స్ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేసి విక్రయిస్తూ ఏటా రూ.24 లక్షల ఆదాయం పొందుతున్నారు. సుజాతా సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 6, 2026
కోనసీమలో ‘నిప్పుల’ జ్ఞాపకం.. పాశర్లపూడి నుంచి ఇరుసుమండ వరకు!

ఇరుసుమండ ONGC రిగ్ వద్ద సోమవారం <<1877026>>మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే<<>>. ఈ నేపథ్యంలో కోనసీమ జనం పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. 1995 జనవరి 8న పాశర్లపూడిలో జరిగిన ONGC బావి ‘బ్లోఅవుట్’ సుమారు 65 రోజుల పాటు నిప్పుల కొలిమిని తలపించింది. అదే తరహాలో 2014 జూన్ 2న నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలి 22 మందిని బలితీసుకుంది. ఆ భయానక మంటలు, ప్రాణనష్టం ఇప్పటికీ కోనసీమ జనం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.


