News March 3, 2025

నిర్మల్‌: 8, 9వ తరగతి విద్యార్థులకు పోటీలు

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8, 9 తరగతుల బాలికలకు బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 

Similar News

News February 23, 2026

పథకాల అమలులో AI.. అక్రమాలకు చెక్!

image

TG: సంక్షేమ పథకాల అమలులో AI టెక్నాలజీ వాడాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. దీని వల్ల అక్రమాలకు చెక్ పడుతుందని, పథకాలు నిజమైన అర్హులకే చేరుతాయని భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని శాఖల డేటాబేస్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి లింక్ చేస్తారని, లబ్ధిదారుల లిస్టు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని సమాచారం. ఎవరైనా నకిలీ వివరాలతో లబ్ధి పొందాలని చూస్తే డేటా మ్యాచింగ్ ద్వారా ఏఐ గుర్తిస్తుంది.

News February 23, 2026

మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

image

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మ సమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్​, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.

News February 23, 2026

BREAKING: మాజీ మంత్రి కన్నుమూత

image

రైల్వే మాజీ మంత్రి, TMC నేత ముకుల్ రాయ్(71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చనిపోయినట్లు కుమారుడు సుభ్రాంశు వెల్లడించారు. ముకుల్ ఒకప్పుడు TMC చీఫ్, సీఎం మమతకు సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో రెండో స్థానంలో పరిగణించేవారు. అయితే 2017లో ఆయన బీజేపీలో చేరారు. 18 ఎంపీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ TMCలో చేరారు.