News April 3, 2025

నిర్మల్: KU.. గడువు మరోసారి పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News February 25, 2026

ఖమ్మంలో డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు

image

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ రూ.13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ రూ.10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 25, 2026

పల్నాడు: వేధింపుల కేసులో కానిస్టేబుల్‌కి రిమాండ్

image

కృష్ణాజిల్లా APSRTCలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేకల నరేంద్రను మంగళవారం నాదెండ్ల పోలీసులు అరెస్టు చేశారు. మండలానికి చెందిన ఓ యువతిని ఆయన వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడడంతో కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్రను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.

News February 25, 2026

వనపర్తి: ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

image

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం అలుముకుంది. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం ఓ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. బుధవారం హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వర్సిటీ అధికారులు వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.