News April 11, 2025

నిర్మల్‌: MAY 1 నుంచి క్రీడా శిబరాలు.. APPLY NOW

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మే 1 నుంచి 31 తేదీ వరకు ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల క్రీడా సంఘాలు, పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని తెలిపారు.

Similar News

News October 31, 2025

ఖమ్మం: టీచర్‌గా మారిన కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఎన్‌ఎస్‌సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన టీచర్‌గా మారి బోర్డుపై అక్షరాలు రాసి, విద్యార్థుల చదివే సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. 30 రోజుల్లో ఫలితాలు కనిపించాలని ఆయన ఆకాంక్షించారు.

News October 31, 2025

పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

image

బ్రూసిల్లా అబార్టస్‌ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్‌. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 31, 2025

అనకాపల్లి: జిల్లాలో 1,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం

image

తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు అనకాపల్లి జిల్లాలో 1,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి మండలంలోనే అత్యధికంగా 600 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అలాగే శారద నదికి పలుచోట్ల గండి పడిన కారణంగా రాంబిల్లి, మునగపాక మండలాల్లో కూడా వరి పంటకు భారీ నష్టం జరిగింది.