News March 28, 2025

నిర్మల్: SCHOLARSHIP.. APPLY NOW

image

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అర్హులని చెప్పారు. కొత్తగా ఉపకార వేతనాల కోసం మే 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 20, 2025

తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

image

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్‌ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.

News November 20, 2025

జగిత్యాల జిల్లాకు జీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

image

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు అధికారులను నియమించింది. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడినిగా పి. వెంకట్ రెడ్డిని, వ్యయ పరిశీలకుడినిగా ఎం. మనోహర్‌ను నియమిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News November 20, 2025

పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

image

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.