News March 28, 2025
నిర్మల్: SCHOLARSHIP.. APPLY NOW

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అర్హులని చెప్పారు. కొత్తగా ఉపకార వేతనాల కోసం మే 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
నూజివీడు: తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి.. భర్త అరెస్ట్

రెండేళ్ల కుమారుడికి మాటలు రావడంలేదని భర్త వేధింపులతో సాయి లక్ష్మి హైదరాబాదులో ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాఠకులకు విధితమే. భర్త, అత్తమామల వేధింపులతోనే తన కుమార్తె పిల్లలతో సహా మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త నూజివీడుకు చెందిన చల్లారి అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.
News October 16, 2025
CCI కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలి

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. 2025- 26 పత్తి కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
News October 16, 2025
కామారెడ్డి: రైల్వే ట్రాక్పై మహిళ మృతదేహం

కామారెడ్డి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది, ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.