News March 28, 2025

నిర్మల్: SCHOLARSHIP.. APPLY NOW

image

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అర్హులని చెప్పారు. కొత్తగా ఉపకార వేతనాల కోసం మే 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 11, 2025

మేడ్చల్: ‘రేషన్ కార్డులకు E-KYC పూర్తి చేయాలి’

image

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

NLG: వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ కలకలం

image

ఉమ్మడి నల్గొండలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. DCMS మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈనెల 14న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో జిల్లాలో పలువురు నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వచ్చినా, ఇది అధికారులిచ్చిన తొలి నోటీసు కావడం గమనార్హం. జిల్లాలో ఇంకెంత మంది నేతలు ట్యాపింగ్ బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.

News July 11, 2025

కాకినాడతో నాకు ఎంతో అనుబంధం: నటుడు సుమన్

image

కాకినాడ రూరల్ వలస పాకలలో సాయిబాబా గుడి వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సినీ హీరో నటుడు సుమన్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకుడు పంతం సందీప్ హీరో సుమన్ ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. సుమన్ మాట్లాడుతూ.. కాకినాడ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.