News April 9, 2025

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: సూర్యాపేట కలెక్టర్

image

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వైద్య అధికారులు, టీఎస్ ఎమ్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. 

Similar News

News November 12, 2025

NIT సమీపంలో ఛాతి నొప్పితో వ్యక్తి మృతి

image

NIT సమీపంలో ఛాతి నొప్పితో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న ఓ ప్యాసింజర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో తన కుమారుడికి ఫోన్ చేశారు. వెంటనే నెక్స్ట్ స్టేజీ వద్ద దిగి ఆసుపత్రికి వెళ్లమని కుమారుడు సలహా ఇవ్వడంతో కాజీపేటలో ట్రైన్ దిగి ఆటోలో ఆసుపత్రికి వెళుతుండగా ఎన్ఐటీ సమీపంలో నొప్పి ఎక్కువై మరణించాడని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News November 12, 2025

జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

image

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్‌ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్‌, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్‌ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

News November 12, 2025

HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

image

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.