News January 5, 2025

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

image

గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.

Similar News

News January 19, 2025

జాన్‌పహడ్ సైదన్న జాతరకు వేళాయే

image

మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్‌పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.

News January 19, 2025

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 19, 2025

చెరువుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!

image

చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం <<15183553>>ప్రసిద్ధ శైవక్షేత్రంగా<<>> భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడైన తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.