News March 30, 2024
నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళి అమలు: ఢిల్లీ రావు
విజయవాడ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికల నియమావళిని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 30, 2024
మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు.
News September 30, 2024
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన పోలీసులు
కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారని జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదివారం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారని తెలిపింది.
News September 30, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS
⁍ విజయవాడలో విషాదం.. పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి
⁍ కృష్ణా: TDP MLC అభ్యర్థి ఖరారు?
⁍ చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి
⁍ తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని
⁍ రేపు విజయవాడకు రానున్న సినీ హీరో
⁍ కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్