News August 30, 2024
నీటి కుంటలను తలపిస్తున్న మహానంది క్షేత్రానికి వెళ్లే రహదారి

మహానంది పుణ్య క్షేత్రంలోని స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ప్రతి నిత్యం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అయితే వ్యవసాయ కళాశాల నుంచి మహానంది పుణ్యక్షేత్రం వరకు ఉన్న 3 కిలోమీటర్ల మేర రహదారి భక్తులకు నరకయాతన అనుభవించే విధంగా అడుగుకో గుంతతో దర్శనమిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులు, నీటి కుంటలను తలపిస్తున్నాయి.
Similar News
News December 18, 2025
‘మాతృ మరణాల నివారణే లక్ష్యం’

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం (MDSR) జరిగింది. బిడ్డకు జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, ప్రసవ సమయంలో శిశు మృతులు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గర్భిణికి 12 వారాల్లోపు వైద్య పరీక్షలు పూర్తి చేయాలన్నారు. హైరిస్క్ గర్భవతులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సూచించారు.
News December 18, 2025
కలెక్టర్ల సదస్సులో సిరి, ఎస్పీ

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
News December 18, 2025
సీఎం చంద్రబాబుకు అవార్డు ఏపీకి గర్వకారణం: మంత్రి టీజీ

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి టీజీ భరత్. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది. విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అంటూ భరత్ ట్వీట్ చేశారు. ఏపీకి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.


