News March 7, 2025

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

image

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

Similar News

News February 12, 2026

బయో మిథనైజేషన్ ప్లాంట్‌కు ప్రతిపాదనలు: కమిషనర్

image

నగరంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. గురువారం ఎన్‌ఐయూఏ, ఈడబ్ల్యూ సిటీ ప్రతినిధులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ఆర్ఎఫ్పీ (ప్రతిపాదనలు)లను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

News February 12, 2026

T20 WC: భారత్ భారీ స్కోర్

image

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.

News February 12, 2026

‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

image

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.